Thursday, May 16, 2024

Breaking: రెండు లారీలు ఢీకొని.. చెలరేగిన మంటలు

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని కుప్టి వంతెన వద్ద కిందపడిపోయి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఢీకొట్టిన లారీ డ్రైవర్‌, క్లీనర్‌ అందులోనుంచి దూకేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్త సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement