Friday, April 26, 2024

సింహగిరిపై వైభవంగా నిత్యకళ్యాణం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో మంగళవారం సింహాద్రినాధుడి నిత్యకళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా సింహాద్రినా ధుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సుప్రభాతసే వతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం గంగ ధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలుతో అభిషేకం గావించారు. స్వామి, అమ్మ వార్లను సర్వాభరణాలుతో అందంగా అలంకరించి శాస్త్రోక్తంగా నిత్యకళ్యాణం నిర్వహించారు. నిత్యకళ్యాణంలో పలువురు భక్తులు పాల్గొని స్వామిని సేవించి తరించారు. ఇక ఈనెల 16 నుంచి ప్రారంభమైన పవిత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మహాపూర్ణాహుతి, ఏకాంత స్నపనంతో ఉత్సవాలు ముగిసాయి. ఏడాది పొడవున స్వామి, అమ్మవార్లకు పలు ఆర్జిత సేవలతో పాటు నిత్యకైంకర్యాలు నిర్వహించడం జరుగు తుంది. అయితే ఆ సమయంలో తెలిసి, తెలియక పొరపాట్లు జరిగితే తమను క్షమించమని స్వామిని వేడుకోవడమే పవిత్రోత్సవాల ప్రత్యేకత.

Advertisement

తాజా వార్తలు

Advertisement