Friday, April 19, 2024

ఏవోబీలో కాల్పుల మోత..

విశాఖ ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాల దృష్ట్యా మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు… మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో కాల్పులు జరుపుతూ మావోయిస్టులు తప్పించుకున్నారు. పరారైన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. పాడేరు, జి.మాడుగుల సర్కిల్ ఏజెన్సీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని జి.మాడుగుల మండలం నుర్మతి పోలీసు అవుట్ పోస్టుల సమీపంలో గాలింపు ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరా పెట్టి ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలను నిశితంగా పరిశీలిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Tollywood Drug Case: ఈడి విచారణకు హాజరైన తరుణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement