Saturday, May 4, 2024

నవ గ్రహముల జననము

హిందువుల దైనందిన జీవిత ఆచారాలలో నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యతవుంది. మనుష్యుల స్థితిగతులు, భవిష్యత్తు వ్యవ హారాలపై వీటి ప్రభావం గురించి చాలామందికి విశ్వా సం వుంటుంది. తత్ఫలితంగా నవగ్రహాలను పూజించ డం, హోమాలు, వ్రతాలు నిర్వహించడం ఆచారాలలో ఒక ముఖ్యమైన అంశం. చాలా ఆలయాలలో ముఖ్యం గా శివాలయాలలో నవగ్రహాల మందిరా లు ఉంటాయి. ఎందరో విశ్వసిస్తున్న నవగ్రహాల జననాన్ని ఒకమారు మననం చేసుకుందాం.
1) సూర్యుడు: శ్రీ కశ్యప ఋషికి దక్షుని పుత్రికయగు అదితికిని ”వివస్వంతుడు (సూర్యుడు)” జన్మించెను (ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ధ సప్తమి) కశ్యపుని కొడుకు కనుక ”కాశ్యపుడు” అని అదితి కొడుకు కనుక ”ఆదిత్యుడు” అని అండమున మృతము లేని వాడు కనుక ”మార్తాండుడు” అని నామములు వచ్చె ను. సూర్యునకు సంజ్ఞాదేవికిని ”వైవస్వతుడు” ”య ముడు” ”యమున”లు జన్మించెను. సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా పెట్టి పుట్టింటికి వెళ్లిపోతుంది. తరువాత ఛాయకు ”శని” భగవానుడు జన్మించెను. యముడు ధర్మరాజు అను నామముతో పితృ లోక పాలకుడయ్యె ను. శని గ్రహ పదవిని పొందెను. వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు.
2) చంద్రుడు: అత్రి మహర్షి అనసూయల సంతానం. అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హతార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారులు ప్రదక్షిణలు గావించెను. ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదు లు మొలకెత్తెను (నందన నామ సంవత్సర కార్తీక శుద్ధ చతుర్థశి) సోముని బ్రహ్మ భూమికి రాజును చేసెను. చంద్రుని పుత్రుడు బుధుడు.
3) కుజుడు: శివుని నిండి వెలువడిన తేజము పార్వ తీదేవి గ్రహంచి గర్భవతి అవగా ఆమే ఆ తేజమును భరింపలేక భూదేవికి ఇచ్చెను. ఆమే ఆ తేజమును ధరిం పగా ”కుజుడు” (అంగారకుడు) జన్మించెను. (అక్షయ నామ సంవత్సరం వైశాఖ బహుళ విదియ) రుద్రుని తేజము విష్ణువు సంర క్షణ భూదేవి ఓర్పు లభించినవాడు కనుక గ్రహమండలమున స్థానమునొందెను.
4) బుధుడు: సోమునకును రోహణి తారకు బుధు డు జన్మించెను. (సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ధ ఏకాదశి) బుధునికి వైరజకిని పురూరవుడు
జన్మిం చెను.
5) బృహస్పతి: సురూప ఆంగీరసులకు ”బృహ స్పతి” జన్మించెను. (సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీ యుజ శుద్ధ ద్వాదశి) ఇతని భార్య ”తారాదేవి”. ఇతడిని దేవతలకు గురువుని చేసెను. కనుక ”గురుడు” అనెదరు.
6) శుక్రుడు: భృగు ప్రజాపతికిని ఉషనలకు సంతా నం ”ఉశనుడు” జన్మించెను. (మన్మథ నామ సంవత్స రం శ్రావణ శుద్ధ దశమి) కుచేలుని ధనమును హరించు టచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగశక్తితో శివుని ఉదరమున ప్రవేశిం చెను. పరమేశ్వరు డు అతడిని శిశ్న ము ద్వారా బయటకు విడిచెను అతడు శుక్రము రూప మున విసర్జింపబడెను కనుక అతడిని ”శుక్రుడు” అనె దరు. అత్యంత మహా మంత్రశక్తిని పొందినవాడు కను క రాక్షసులు శుక్రుడిని వారి గురువుగా పొందిరి. నాటి నుండి ”శుక్రాచార్యునిగా” పెరు పొందెను. గ్రహ మండ లమున స్థానం పొందెను.
7) శని: సూర్యునికి ఛాయాదేవికి కలిగిన సంతా నమే ”శని”. ఇతని వృత్తాంతము సూర్యుని వృత్తాంత మునందు చెప్పబడెను. (వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి) ఇతడు మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు. త్రిమూర్తులను సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు. గ్రహ మండలమున స్థానం పొందెను.
8) రాహువు: కశ్యప మహర్షికి సింహకకు ”రాహు వు” జన్మించెను. ఇతడు రాక్షస లక్షణములు కలవాడు కనుక రాక్షసునిగా పరిగణిస్తారు. (రాక్షస నామ సంవ త్సరం కృష్ణ చతుర్థశి) క్షీర సాగర మథనంలో లబించిన అమృతాన్ని మహావిష్ణువు ”మోహని” రూపముతో పంచుతున్నపుడు రాహువు దేవతల రూపం దాల్చి అమృతమును గ్రహంచెను. సూర్యచంద్రులు చూసి విష్ణువుకి చెప్పగా తన చక్రముతో రాహువు తల ఖండిం చెను. అమృత ప్రభావంతో తల మొండెము జీవముతో ఉండుటచేత పాము శరీరం అతకబడింది.
9) కేతువు : విష్ణువుచే ఖండింపబడిన రాహువు శరీరముకు పాము తల తగిలించి కేతువు అని నామం పెట్టిరి. ఇతని భార్య పేరు చిత్రలేఖ. రాహు కేతువులు ఇరువురు గ్రహమండలమున ఛాయాగ్రహములు,
నవ గ్రహ దేవతల జన్మ వృత్తాంతములు చదివిన ఆపదలు తొలగి యశస్సు, ఆయుష్షు, ఆరోగ్యం సంకల్ప సాఫల్యము కలుగుతాయి. సర్వత్రా శుభమగుతుందని బ్రహ్మ పురాణం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement