Tuesday, May 14, 2024

తిరుచానూరులో ఏకాంతంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు, ప్రభ న్యూస్‌: తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను ఈ నెల 30 నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు- టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మంగళవారం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో వాహన సేవలు, పంచమి తీర్థం వాహన మండపంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించా రు. ఉత్సవాల విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉద్యాన, విద్యుత్‌ విభాగాల అధికారులు ఆలయ అలంకరణలో, ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణలో శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. భక్తులందరికీ మూల మూర్తి దర్శనం కల్పించాలన్నారు. డెప్యూటేషన్‌ సిబ్బందికి అన్నప్రసాదాలు అందించాలని ఆదేశించారు. నవంబరు 29న ఉదయం లక్షకుంకుమార్చన, సాయ ంత్రం అంకురార్పణ, 30న ధ్వజారోహణం, డిసెంబరు 4న రాత్రి గజ వాహనం, 8న పంచమితీర్థం, 9న పుష్పయాగం నిర్వహించనున్నట్లు- వివరించా రు.

Advertisement

తాజా వార్తలు

Advertisement