Monday, May 6, 2024

ఆశీర్వచనానికీ, అక్షింతలకీ సంబంధం ఏమిటి

హిందూ సనాతన సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్న వారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్ధులను ‘విద్యా ప్రాప్తిరస్తు’ అని, పెళ్ళయిన ఆడవారిని ‘దీర్ఘ సుమంగళీభవ’ అని, పురుషులని ‘దీర్ఘాయుష్మాన్‌ భవ’ అని.. అలా.. సమయానికి తగ్గట్లు- వుంటాయి ఆ దీవెనలు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్ర మాలలో అక్కడ పండితులు ‘గో బ్రాహ్మణో శుభంభవతు’, ‘లోకా స్సమస్త సుఖినోభవంతు’ అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండా లనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ.. ఇలా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు. అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా? అవి ఫలిస్తాయా? తప్పకుండా ఫలిస్తాయి. సత్పధంలో నడిచే వారికి సత్పురు షులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలగుతాయి. అంతేకాదు, పూర్వజన్మ పాపాలు కూడా నాశనమ వుతాయంటారు. గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకో వచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు, వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి.
అక్షింతల సంకేతం
సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజు నుంచీ ప్రతి శుభసందర్భంలోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఏమిటి సంబం ధం? అక్షింతలే ఎందుకు చల్లాలి. వేరే ధాన్యాలు వున్నాయి కదా? వాటిని చల్లవచ్చు కదా? మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందు కు చల్లాలి.
బియ్యం చంద్రుడికి కార కం. చంద్రుడు మనస్సుకి కార కుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్న మన్నమాట. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురు వు శుభ గ్రహం. ఆయనకి సంకే తంగా, శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింత లను మంత్రపూర్వకంగా తల మీద చల్లుతారు.
మంత్రం అంటే క్షయం లేనటు-వంటిది. అకారం నుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రా నికి అత్యంత శక్తి వుంటు-ంది. మంత్రాన్ని చదివేటప్పుడు చేతి తో పట్టు-కున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మం త్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టు-కుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనా నికి శక్తి వుంటు-ంది.
మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఎంతో ప్రాధా న్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ”అక్షతాన్‌ సమర్పయామి” అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్ర దాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు.
మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుం దని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభకార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది. కానీ పసుపు కలపకుండా బియ్యాన్నే అక్షతలుగా వాడతారు. బియ్యంలో తగి నంత పసుపు, చిటికెడు కుంకుమ, తడిచీ తడవనట్లు- కొన్ని నీళ్ళు వేసి అక్షతలను తయారుచేస్తారు. రెండు చుక్కల ఆవునెయ్యి వేసి కలిపిన అక్షింతలు శుభప్రదం. బియ్యంలో పసుపువేసి ఆవునేతితో కలిపి ఆ అక్షింతలను ఓ సీసాలో పోసుకుంటే పూజకు ఎన్ని రోజులు అయినా వాడుకోవచ్చు. అదే నీళ్ళతో కలిపిన అక్షింతలు అయితే ఏ రోజుకు ఆరోజు చేసుకోవాలి. నీళ్ళతో కలిపిన అక్షింతలు మరుసటి రోజు పూజకు వాడకూడదు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారుచేసినట్లయితే ఆ అక్షతలు అత్యంత పవిత్రమైనవి…||
సేకరణ: పుల్లాభొట్ల భాస్కరశర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement