Saturday, May 4, 2024

ఆంజనేయస్వామి పంచముఖాల ప్రాశస్త్యం

అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రి యాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ, అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటు-న్నాడు. అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది. స్వామివారి పంచముఖాలలో ఒకో మోముదీ ఒకో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమా న గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహా వతారం, ఊ్వర్ధ ముఖాన హయ గ్రీవుని అంశ. అలాగే అ అయిదు ముఖాలు తన భక్తులను అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యా లనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్ట సిద్ధినీ కలుగ చేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతా రం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.
పంచముఖుడు ఎందుకయ్యాడు?
శ్రీరాముని రక్షించడానికి ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయ ణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలు చుకునే సంప్రదాయం మొదలైంది. అత్యంత భక్తిశ్రద్ధ లతో స్వామి కార్యం నెరవేర్చాడు ఆంజ నేయస్వామి. అంతేనా శ్రీరాముని కూడా మైరావణుని బారి నుంచి రామలక్ష్మణులను కూడా రక్షించాడు.
మైరావణ వృత్తాంతం
రామాయణంలో రావణుడు సీతను అపహరిం చడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం… తెలిసిందే! సీత ను చేజిక్కించుకునేందుకు రామ రావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధా రణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమా రుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూల డంతో బెంబేలుపడిపోతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమా దం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలా ఉంచినా… అందరి కళ్లూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి తీసుకుపోతాడు మైరావణుడు.
హనుమంతుని పయనం
రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారనీ… తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు, హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది.
మైరావణుని సంహారం
మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన హనుమ అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపా యాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్క సారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడ దని తెలుస్తుంది. దాంతో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊ్వర్ధ ముఖం… ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖా లను ధరించి, అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తా డు. పంచముఖాలతో పాటు-గా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి… మైరావణుని అంతం చేస్తాడు. అతనే పంచముఖాంజ నేయుడు.

– చివుకుల రాఘవేంద్రశర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement