Saturday, April 27, 2024

విరూపాక్ష అప్ డేట్.. ఫొటో పోస్ట్ చేసిన మేక‌ర్స్

కార్తిక్ దండు తెర‌కెక్కిస్తున్న చిత్రం విరూపాక్ష‌.ఈ మూవీలో హీరోగా సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నాడు.సాయి ధరమ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే నటిస్తుంది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే నెలకొన్నాయి. దానికి తగ్గట్లే ఇటీవలే రిలీజైన టీజర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మిస్టరీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తి క్రియేట్‌ చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు కాస్ట్‌ అండ్‌ క్రూతో ఉన్న ఫోటోను షేర్‌ చేశారు. ఈ సినిమాకు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement