Monday, March 25, 2024

చెరువులో పడి అన్నదమ్ముల మృతి

వరంగల్ క్రైమ్, మార్చి 31(ప్రభ న్యూస్) : ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలురు చెరువులో పడి మృతిచెందిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని 14వ డివిజన్ ఏనుమాముల పరిధిలోని చాకలి ఐలమ్మ నగర్ లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న లక్ష్మీబాయి, లకన్ సింగ్ దంపతులు. లకన్ సింగ్ మార్కెట్లో హమాలీ పని చేస్తుండగా, లక్ష్మీబాయి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం అన్నదమ్ములిద్దరూ బహిర్భూమి కోసమై కోట చెరువు వద్దకు వెళ్లి, తిరిగి రాని లోకాలకు పోయారు. కాలుజారీ పోయి చెరువులో పడి మృతిచెందిన ఘటన తీవ్రంగా కలిచి వేసింది.

ఉదయం వరకు ఇంట్లోనే కళ్ళముందు తిరిగిన అన్నదమ్ములు, కొద్ది క్షణాల్లోనే విగత జీవులుగా పడి కన్పించడంతో చాకలి ఐలమ్మ నగర్ లో రోదనలు మిన్నంటాయి. సీపీఎం నేతృత్వంలోని చాకలి ఐలమ్మ నగర్ లోని గుడిసెలో టాయిలెట్స్ లేక పోవడంతో ఇద్దరు బాలురు నిండు ప్రాణాలు ఆనంతవాయువుల్లో కలసి పోయాయి. మృతులు కిరణ్ సింగ్ (12), దీపక్ సింగ్(9)లుగా గుర్తించారు. ఏనుమాముల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement