Thursday, May 2, 2024

పలు రాష్ట్రాల్లో రికార్డులు సృష్టిస్తున్న ‘విక్ర‌మ్‌’.. వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్‌ను కొల్ల‌గొడుతున్న క‌మ‌ల్‌

లోక నాయ‌కుడు కమల్ హాసన్ ‘విక్రమ్’తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో నటించారు. ముఖ్యంగా కమల్ హాసన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే బాక్సాఫీస్ కలెక్షన్లలో ‘విక్రమ్’ ఏమాత్రం తగ్గడంలేదు. విక్ర‌మ్ సినిమాతో కమల్ హాసన్ తన కెరీర్‌లో సరికొత్త రికార్డులు సృష్టించాడు.

2022లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల్లో ‘విక్రమ్’ ఒకటిగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా విడుదలైన తొలిరోజే రూ.45 కోట్లు వసూలు చేసింది. ఒక్క తమిళనాడులోనే రూ.100 కోట్లకుపైగా వసూలు చేసినట్లు స‌మాచారం.

ఇదిలా ఉంటే ఏపీ తెలంగాణ‌ రాష్ట్రాల్లోనూ విక్రమ్ మూవీతో క‌మ‌ల్‌ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. గత 10 రోజుల్లో ఈ సినిమా దాదాపు 25కోట్ల దాకా వసూలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక కేరళలో రూ.30 కోట్లు వసూలు చేయగా, కర్నాటకలో రూ.15 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఈ వీకెండ్ చివరి నాటికి మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు మూవీ మేక‌ర్స్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement