Thursday, May 16, 2024

వరుణ్ ధవన్ భేడియాపై లేటెస్ట్ అప్డేట్.. త్వరలోనే భేడియా 2

అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన వరుణ్ ధవన్ భేదియా బాక్సీఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లతో మంచి బిజినెస్ చేసింది. ఈ క్రియేచర్ కామెడీ థ్రిల్లర్ థేయేటర్ దగ్గర అజయ్ దేవగన్ దృశ్యం 2తో పోటీ పడింది. కాగా, ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా.. అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర పోషించారు. గత రాత్రి జియో స్టూడియోస్ ఈవెంట్‌లో, భేదియా సీక్వెల్ ఎనౌన్స్ చేశారు. అయితే, పార్ట్ 1 పెద్దగా హిట్ కాకపోవడంతో ఇప్పుడు ఈ ప్రకటన నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలను పొందింది. ఇక ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ మూవీ సీక్వెల్ 2025లో బిగ్ స్క్రీన్స్ పైకి రానుంది. అలాగే, భేదియాలో కృతి సనన్ పాత్రలో ఎవరు నటిస్తారనేది ఉత్కంఠగా ఉంటుంది. Maddock Films, Jio Studios Bhediya 2ని నిర్మించనున్నాయి. కాగా, ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement