Monday, April 29, 2024

సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ తమిళ ట్రైలర్ రిలీజ్

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌ మూవీలో సంయుక్త హీరోయిన్ గా కనిపించనుంది. తాజా సమాచారం ఏమిటంటే, ఈ పాన్-ఇండియన్ మూవీ తమిళ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. కాగా, తమిళనాడులో ఈ సినిమా రిలీజ్ హక్కులను ప్రముఖ బ్యానర్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

సునీల్, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మెగా మూవీకి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. అంజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి సౌండ్‌ట్రాక్‌లను అందించారు.. వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement