Thursday, April 25, 2024

మహేష్ బాబు తో త్రిష మరోసారి రొమాన్స్!!

హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, వర్షం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది త్రిష. అయితే త్రిష ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మహేష్ బాబు తో ఓ సినిమా చేయబోతుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, సైనికుడు సినిమాలు వచ్చాయి.

ఇప్పుడు తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమాలో త్రిషను హీరోయిన్ గా సెలెక్ట్ చేసారట. ఈ సినిమాలో మొత్తం ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండగా… అందులో ఓ హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేశారట. మరో హీరోయిన్ ను పూజ హెగ్డే పెరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement