Wednesday, April 24, 2024

ప్రపంచ పులుల దినోత్సవం… టైగర్ తో సీఎం జగన్

ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం ప్రపంచ పులుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 63 పులుల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని, పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల పులుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే పులుల సంఖ్య 47 నుంచి 63కి పెరిగిందని చెప్పారు. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకూ కూడా అవి ప్రయాణిస్తున్నాయని వివరించారు. కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా పులుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అధికారులు చెప్పారు. టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతాల్లో అధికారులకు, ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు సీఎం అంగీకారం తెలిపారు.

కాగా, సీఎం క్యాంప్‌ కార్యాలయంలో అటవీ శాఖ నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్‌  చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్ ఎన్‌ ప్రతీప్‌ కుమార్, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement