Thursday, May 9, 2024

21 ఏళ్ల బద్రి

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బద్రి. ఈ చిత్రం దర్శకుడిగా పూరి జగన్నాథ్ కు ఇది మొదటి చిత్రం. ఇక ఈ సినిమాలో రేణు దేశాయ్ ,అమీషాపటేల్ హీరోయిన్స్ గా నటించారు. రేణు దేశాయ్ కూడా ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మరోవైపు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.

ఈ సినిమాలో నువ్వు నందా అయితే… నేను బద్రి.. బద్రీనాథ్ అయితే ఏంటి!! అంటూ పవన్ ప్రకాష్ రాజ్ ల మధ్య సన్నివేశాలు విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. ఆ రోజుల్లోనే ఈ సినిమా 18 కోట్లకు పైగా షేర్ లను వసూలు చేసింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా… ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 21 ఏళ్లు. 2000 సంవత్సరం ఏప్రిల్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement