Friday, May 3, 2024

కరోనా ప్రళయం.. ఒక్కరోజులో 2.59 లక్షల కేసులు, 1,761 మరణాలు

దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. సోమవారం కొత్త‌గా 2,59,170 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న 1,54,761 మంది కోలుకున్నారు. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది. అటు గడిచిన 24 గంట‌ల సమయంలో 1,761 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,80,530కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,31,08,582 మంది కోలుకున్నారు. 20,31,977 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. కాగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 12,71,29,113 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement