Monday, May 6, 2024

తిరుమల శ్రీవారి సేవలో.. నాగార్జున దంపతులు

హీరో నాగార్జున దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నైవేద్య విరామ సమయంలో అక్కినేని నాగార్జున.. అమల దంపతులు కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాగార్జున..త‌న కుమారులు.. అఖిల్ నటించిన ఏజెంట్.. నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఏడాది కాలం తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మా అబ్బాయిల సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇద్దరూ చాలా కష్టపడి సినిమాలు చేశారు. కేవలం కష్టం ఒక్కటే కాదని.. శ్రీవారి ఆశీస్సులు కూడా ఉండాలని స్వామివారి దర్శనార్థం వచ్చాం అని అన్నారు నాగార్జున. అఖిల్ నటించిన ఏజెంట్.. చైతూ నటించిన కస్టడీ చిత్రాలు ఘన విజయం సాధించాలని శ్రీనివాసుడిని కోరుకున్నానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement