Sunday, May 19, 2024

MBNR: కాంగ్రెస్ లో చేరిన మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవర మల్లప్ప

మక్తల్, మే6 (ప్రభ న్యూస్) : తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవర మల్లప్ప ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ ఏపీ.జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా.. వారు మల్లప్పకు పార్టీ కండువా క‌ప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా దేవరమల్లప్ప మాట్లాడుతూ… పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పాలనలోనే బడుగు వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, మాదిరెడ్డి జలంధర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గట్టు తిమ్మప్ప, బీ.శివకుమార్, నాయకులు జి.గోపాల్ రెడ్డి, జి.లక్ష్మారెడ్డి, గడ్డంపల్లి హన్మంతు, బోయ రవికుమార్, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement