Monday, April 29, 2024

ఆర్కే బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం

విశాఖ ఆర్కే బీచ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ అనుమానాస్పద మృతి అందర్నీ షాక్‌కి గురిచేసింది. డెడ్‌బాడీ పడి ఉన్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతదేహం ఇసుకలో కూరుపోగా కేవలం ముఖం మాత్రమే బయటకు కనిపిస్తోంది. ఇది హత్యా..? ఆత్మహత్యా అన్నది అంతుపట్టకుండా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహిళ గాజువాక నడుపూరికి చెందిన స్వాతిగా గుర్తించారు.

నిన్న సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు.. పోలీసుల్ని ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తుండగానే స్వాతి ఆర్కేబీచ్‌లో శవమై తేలింది. అయితే డెడ్‌బాడీ పడి ఉన్న తీరుపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డెడ్‌బాడీ పడి ఉన్న తీరు చూస్తే హత్యేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే స్వాతిది ఆత్మహత్యా? మరేదైన అఘాయిత్యమా అన్న కోణంలో దర్యాప్తు కోసం స్వాతి మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement