Sunday, April 28, 2024

ముంబై లో విజయ్ తో రష్మిక

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఆ తరువాత పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమాతో సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ జంట మళ్ళీ డియర్‌ కామ్రేడ్ చిత్రంతో సందడి చేశారు. అప్పటి నుంచి కూడా ఈ ఇద్దరు క్యూట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. గతం లో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఖండించారు.

ఇదిలా ఉండగా చాలారోజుల తర్వాత ఈ ఇద్దరు ముంబై కెమెరా కంటికి చిక్కారు. సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై కి వెళ్లిన ఈ ఇద్దరు విజయ్‌, రష్మిక డిన్నర్‌ కోసం నగరంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఈ జంటకు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement