Thursday, May 2, 2024

పాఠ‌శాల‌కు ప్రాజెక్ట‌ర్ విత‌ర‌ణ‌..

సోంపేట…. తమ గ్రామంలో ఉండే పాఠశాలలో సాంకేతిక విద్య అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ 30వేల‌ రూపాయలు విలువచేసే ప్రాజెక్టును పాఠశాల ప్రధానోపాధ్యాయులు కు అందజేసి విద్యా అభివృద్ధి పట్ల బాసటగా నిలిచారు. సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎర్ర. అరవింద్ ఆజాద్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల కు సాంకేతిక విద్య అందుబాటులోకి తేవాలని ఉద్దేశంతో 30వేల‌ రూపాయలు విలువగల ప్రాజెక్టును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెహరా వేణుగోపాల్ కు అందజేశాడు. తమ గ్రామంలో ఉన్న పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలని సాంకేతికపరంగా ఎటువంటి వస్తు సామాగ్రి అవసరమున్న తనకు సంప్రదించాలని అరవింద్ కోరారు. ఈ కార్యక్రమంలో స్నేహ బృందం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లా. నాగేంద్ర, పచ్చిళ్ళ. గిరి, ఉపాధ్యాయ బృందం తడక మాధవరావు, జోగారావు, నీలిమ, పార్వతి, కాంతారావు, రవి, నాగరాజు, పురుషోత్తం, ముకుంద ప్రజలు పాల్గొని అరవింద్ ఆజాద్ కు అభినందించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement