Friday, April 19, 2024

వివాదంలో ‘జాతి రత్నాలు’ సినిమా

ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ‘జాతి రత్నాలు’ సినిమా వివాదంలో చిక్కుకుంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో దేశభక్తి ప్రబోధాత్మకమైన ఓ కవితను వ్యంగంగా ఆలపించారని శివసేన తెలంగాణ విభాగం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఉరికొయ్యకు వేలాడే ముందే ‘సర్ఫరోష్ కీ తమన్నా హబ్ హమారే దిల్ మే హై’ అంటూ పాడిన పాటను ‘జాతిరత్నాలు’ చిత్రంలో అవమానకరీతిలో ఆలపించారని, ఆ గేయం పంక్తుల్లో టాలీవుడ్ హీరోయిన్ల పేర్చు చేర్చి వ్యంగ్యంగా మార్చేశారని శివసేన నేతలు ఆరోపించారు. ఈ మేరకు శివసేన తెలంగాణ విభాగం ప్రధాన కార్యదర్శి భూమా గంగాధర్, ఇతర నేతలు హైదరాబాదులోని కాచిగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్య సమరయోధులను కించపరిచేలా వ్యవహరించిన సినిమా దర్శకుడు, నటీనటులు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సినిమాను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement