Friday, April 26, 2024

సన్ ఆఫ్ ఇండియా… టీజర్ ఆరోజే వస్తుంది !!

సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది అభిమానులు మన్ననలు పొందారు మోహన్ బాబు. అయితే మోహన్ బాబు ప్రస్తుతం డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియా సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆయన కుమారుడు మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ని ఈ నెల 4వ తేదీన విడుదల చేయబోతున్నారు.

అయితే ఆ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. సరిగ్గా 30 ఏళ్ల కిందట మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమా అదే రోజు రిలీజ్ అయింది. ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాధించింది. అందుకే ఈ నెల 4న సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి మోహన్ బాబు ఈ సినిమాతో ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement