Friday, April 26, 2024

మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ సతీమణి కన్నుమూత

ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో ఎస్వీ ప్రసాద్‌ మృతిచెంది ఒక్కరోజు కూడా గడవక ముందే ఆయన సతీమణి లక్ష్మి సైతం చనిపోయారు. ఈ వేకువజామున 3 గంటలకి ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

కొద్దిరోజుల క్రితం ఎస్వీ ప్రసాద్‌తో పాటు ఆయన భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు వర్థన్‌, శైలేష్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. తొలుత భార్యాభర్తలు సోమాజిగూడలోని ఓ ఆసుపత్రిలో చేరారు. తర్వాత ఇద్దరు కుమారులు కూడా అదే ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఎస్వీ ప్రసాద్‌, బుధవారం వేకువ జామున లక్ష్మి మృతిచెందారు. ఇద్దరు కుమారుల ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement