Wednesday, May 1, 2024

సర్కారు వారి పాట సినిమా మ్యూజిక్ రైట్స్ వారికే !!

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడ్డ… ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పునః ప్రారంభమైంది.

అయితే తాజాగా చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ను రిలీజ్ చేసింది. ఈనెల 31వ తేదీన ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని ప్రకటించింది. అలాగే ఇప్పుడు మరో అప్డేట్ ను రిలీజ్ చేసింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ను సరిగమ సౌత్ సంస్థ సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement