Saturday, April 20, 2024

వైఎస్ఆర్టీపీకి కీలక నేత రాజీనామా

తెలంగాణలో రాజన్న రాజ్యం తేస్తానంటూ పార్టీ పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో  పార్టీకి కీలక నేత గుడ్ బై చెప్పి షర్మిలకు షాక్ ఇచ్చారు.  వైఎస్సార్టీపీ కీలక నేత చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్టీపీ నేత రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి ప్రతాప్‌ రెడ్డి పంపారు. కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్టీపీ ఇన్‌చార్జ్‌గా ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. కొత్తగా పెట్టిన పార్టీని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన సమయంలో కీలక నేత రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: ఈటల ఖాతాలో ‘దళిత బంధు’

Advertisement

తాజా వార్తలు

Advertisement