Saturday, May 4, 2024

వ‌ర‌లక్షి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న‌ ”శబరి” ప్రారంభం..

క్రాక్‌ సినిమా తర్వాత నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ వ‌రుస సినిమాల‌తో తెలుగులో బిజీ అయింది. ప్రత్యేక పాత్రల్లో ఆమెను ఎంపికచేస్తున్నారు దర్శ‌క‌నిర్మాత‌లు. తాజాగా వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. వహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్‌ కాట్జ్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. తెలుగుతో పాటుగా తమిళ, హిందీ మలయాళ భాషల్లోను రూపొందుతోంది ఈ సినిమా. ఈ చిత్రం పూజా కార్య క్రమాలతో నిరాడంబరంగా చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మదన్‌ కెమెరా స్విచాన్‌ చేయగా, నాంది నిర్మాత సతీష్‌ వేగేశ్న క్లాప్‌ ఇచ్చారు. బి.గోపాల్‌ గౌరవ దర్శకత్వం వహించారు. పోకూరి బాబూరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ”క్రైమ్‌ నేపథ్యంలో తీస్తున్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. గణేష్‌ వెంకట్రామన్‌, శశాంక్‌, మైమ్‌ గోపీ, సునయన ఇతర పాత్రధారులు. గోపీసుందర్‌ స్వరాలు అందిస్తున్నారు” అని చెప్పారు. నిర్మాత మాట్లాడు తూ ”శబరిగా కొత్త పాత్రలో వరలక్ష్మి నటిస్తోంది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఇదే నెలలో షూటింగ్‌ ప్రారంభించి, హైదరాబాద్‌, విశాఖ, కొడైకెనాల్‌లో చిత్రీకరిస్తాం” అని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement