Thursday, May 9, 2024

నిర్మాతగా తాప్సి

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది తాప్సి. ఈ సినిమా తర్వాత కూడా తెలుగులో వరుస సినిమాలను చేసింది. కానీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తరువాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. కానీ అక్కడ మాత్రం వరుస సినిమాలు చేస్తూ నిలదొక్కుకుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు నిర్మాతగా కూడా మారబోతోంది.

సొంతంగా ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు స్వయంగా ట్విట్టర్ వేదికగా తాప్సి అనౌన్స్ చేసింది. అవుట్ సైడర్స్ బ్యానర్ పై కొత్త సినిమాను నిర్మించబోతున్నారు తాప్సి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని చెప్పుకొచ్చింది. మరి నిర్మాతగా తాప్సి ఎంత వరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement