Monday, April 29, 2024

కత్తి మృతితో డిఫ్రెషన్ లో శ్రీరెడ్డి

సినీ నటుడు కత్తి మహేష్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కత్తి మహేష్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించారు. కత్తి మహేష్ మరణవార్త వినగానే విషాదంలో మునిగిపోయినని ఇప్పటికే తన ఇద్దరు స్నేహితులు సూసైడ్ చేసుకుని చనిపోయారని..ఇక కత్తి మహేష్ మృతితో తాను డిప్రెషన్ లో ఉన్నానని అన్నారు.

త్వరలోనే డిప్రెషన్ నుంచి బయట పడతానని ఇప్పటికే బయటపడడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక కత్తి మహేష్ తో శ్రీరెడ్డి గతంలో సన్నిహితంగా మెలిగేవారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement