Monday, May 6, 2024

కరెంట్ షాక్‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో విషాదం నెలకొంది. అప్ప‌టిదాకా క‌ళ‌క‌ళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. ఆ క్ష‌ణం వ‌ర‌కు సంతోషంగా ఉన్న‌ ఆ కుటుంబంలోని స‌భ్యులంతా ఒకేసారి విగ‌త‌జీవుల‌య్యారు. బిజావర్ ప్రాంతంలోని ఓ కుటుంబంలో విద్యుత్ షాక్ త‌గ‌ల‌డంతో ఆరుగురు స‌భ్యులు విల‌విల్లాడుతూ నిమిషాల వ్య‌వ‌ధిలో ప్రాణాలు విడిచారు.

వివరాల్లోకి వెళ్తే… బీజావ‌ర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో వాట‌ర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు కుటుంబ‌స‌భ్యులు ఉప‌క్ర‌మించారు. అందుకోసం విద్యుత్ మోటార్ సాయంతో ట్యాంక్‌లోని నీటిని ఖాళీ చేస్తున్నారు. ఇంత‌లో ఒక‌రికి విద్యుత్ వైర్ త‌గిలి షాక్ గురికాగా.. ఒక‌రిని ఒక‌రు ర‌క్షించే ప్ర‌య‌త్నంలో కుటుంబంలోని ఆరుగురు వ్య‌క్తులు నిమిషాల్లో క‌న్నుమూశారు. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌కు సంబంధించి, మృతుల‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement