Saturday, April 27, 2024

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సోనూసూద్ మరో సహాయం

కరోనా ఫస్ట్ వెవ్ సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేసి దేవుడయ్యాడు. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నాడు సోనుసూద్. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాలలో మరో మహత్తర కార్యానికి సిద్ధమయ్యాడు సోనూ.

ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేసిన సోను సూద్ ఇప్పుడు పల్లెల్లో చనిపోయిన మృతదేహాల సంరక్షణ నిమిత్తం డెడ్ బాడీ ఫ్రీజర్ పంపిణీ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే సంకి రెడ్డి పల్లి ,ఆశాపూర్, మద్దికేర తదితర గ్రామాలలో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలోనూ ఇవి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చాలా గ్రామాలలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement