Friday, April 26, 2024

మహబూబాబాద్ జిల్లాలో మృగాళ్లు… మైనర్ బాలికపై అత్యాచారం

మహబూబాబాద్ జిల్లాలో మైనర్ బాలికలపై హత్యాచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే మైనర్ బాలికను అత్యాచారం, హత్య చేసిన ఘటన 24 గంటలు గడవకముందే…. మరో మైనర్ బాలికను గర్భవతిని చేసి మోసం చేసిన సంఘటన జిల్లాలో వెలుగు చూసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు బాబు నాయక్ తండాలో ఓ మైనర్ బాలికను… అదే తండాకు చెందిన భూక్యా అమృతం అలియాస్ దాదా అనే యువకుడు 4 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానని.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. బాలిక పెళ్లిచేసుకోవాలని నిలదీయడంతో పెద్దమనుషుల ముందు పంచాయతీ చేసుకుందామని 3 రోజులు గా తిప్పిస్తున్నాడు. రాజీ పడాలని పెద్దమనుషులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన మైనర్ గర్భిణీ వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. స్థానికులు గమనించి ఆ గర్భిణిని కాపాడి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పట్టణ పోలీసులు
గర్భవతిని చేసిన యువకునిపై ఫోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement