Wednesday, May 1, 2024

TS: భర్తను ఊపిరాడకుండా చేసి.. హత్య చేసిన భార్య

నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 26 (ప్రభ న్యూస్) : కుటుంబ కలహాలతో ఓ భర్తను ఊపిరాడకుండా చేసి భార్య హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా మోపాల మండలం కులాస్ పూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సాయిరెడ్డి (55) భార్య రాధ నిద్ర పోతున్న సమయంలో దిండుతో దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

గత కొంత కాలంగా భార్యా భర్తల మధ్య కలహాలు కొనసాగుతున్నాయని ఈ నేపథ్యంలో భర్త వేధింపుల నుండి భరించలేకనే ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ రూరల్ సౌత్ సీఐ సురేష్ కుమార్ మోపాల్ ఎస్ఐ గంగాధర్ లు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్డం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement