Tuesday, May 14, 2024

వాట్సన్ నెంబర్ అడిగిన నెటిజన్.. సారి అండీ అని న‌వ్విన సునీత..

క‌రోనా వేళ ఆంక్ష‌లు అమ‌లులో ఉండ‌డంతో ప్ర‌జ‌లు రాత్రి స‌మ‌యంలో ఇళ్లలోనే ఉండాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు సింగ‌ర్‌ సునీత అభిమానుల‌తో మాట్లాడుతూ వారు కోరిన పాటలు పాడుతున్నారు. అయితే, సునీత తాజాగా ఇన్‌స్టాలో పాటలు పాడుతుండగా ఓ నెటిజన్ స్పందిస్తూ ఆమె వాట్సాప్ నంబర్‌ చెప్పాల‌ని అడిగాడు. దానికి.. ‘సారీ అండీ’ అంటూ నవ్వుతూ ఆమె స‌మాధానం ఇచ్చారు.

కాగా, అంత‌ర్జాతీయ మాతృదినోత్స‌వం సందర్భంగా ఓ పాట పాడాల‌ని ఓ నెటిజన్ అడిగాడు. అమ్మ అనగానే  క‌న్నీరు వ‌స్తుంద‌ని, ఈ ప్ర‌పంచంలో స్వచ్ఛత అనే దానికి పర్యాయపదమే అమ్మ అని సునీత చెప్పారు. ఇక క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో తాను వారితో ముచ్చ‌టిస్తూ పాట‌లు పాడుతుండ‌డంతో   అభిమానులు కాస్త ఉప‌శ‌మ‌నం పొందుతున్నార‌ని సునీత చెబుతున్నారు. అందుకే తాను ప్రతిరోజు లైవ్ లో మాట్లాడుతున్నాన‌ని చెప్పారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement