Sunday, May 5, 2024

సర్కారు వారి పాట సినిమాకి అదే హైలెట్ !!

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమాలో హీరో ఫాదర్ బ్యాంకు ఉన్నతాధికారి కాగా.. తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్లు ఎగరవేసిన బిజినెస్ మ్యాన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో ఎలా రాబట్టాడు అనేది ఈ కథట.

అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాలో సప్తగిరి ప్రియదర్శి కామెడీ హైలెట్ గా నిలుస్తుందట. అలాగే అనసూయ కూడా అప్పుడే కనిపిస్తుందని తెలుస్తుంది. ముగ్గురు మధ్య కన్ఫ్యూజన్ డ్రామా బాగుందట. ఇక ఈ సినిమాను మైత్రి మూవీస్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ తో కలిసి సంయుక్తంగా మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement