Friday, April 26, 2024

వార్నర్ అన్నా ఏందిది..?: ఈషా రెబ్బా

ఐపీఎల్ 14వ సీజ‌న్‌లో చెన్నై వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. సూపర్ ఓవర్లో రైజర్స్ చెత్త ప్రదర్శనతో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా డేవిడ్ వార్నర్‌ను విమర్శిస్తూ ఓ ట్వీట్ చేసింది. వార్నర్ తప్పిదం కారణంగానే సూపర్ ఓవర్‌లో ఢిల్లీ గెలిచిందంటూ తన ట్వీట్‌ ద్వారా పేర్కొంది. ” వార్నర్ అన్నా ఏందిది..? నువ్వెందుకు వచ్చావ్ ? బెయిర్ స్టోని లేదా సుచిత్‌ను పంపొచ్చు కదా..! నీకు టీమ్ నిర్మించుకోవాలనుంటే డ్రీమ్ లెవెన్‌లో ఆ పని చెయ్యి” అని చురకలంటించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె కామెంట్లను చూసిన మిగతా వారు, టెన్షన్ వద్దంటూ, ఇంకా మ్యాచ్ లు ఉన్నాయంటూ ఈషారెబ్బను ఓదార్చే ప్రయత్నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement