Wednesday, May 8, 2024

మహేష్ ఖాతాలో మరో రికార్డు – అదరగొడుతున్న మైండ్ బ్లాక్ సాంగ్

అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మహేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించగా…రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఇక ఈ సినిమాలో ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఈ సాంగ్ తాజాగా వంద మిలియన్ వ్యూస్ సాధించింది. దీనితో మరో రికార్డును మహేష్ ఖాతాలో జమ అయింది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement