Monday, May 6, 2024

ఓటీటీ లో ఏ వన్ ఎక్స్ ప్రెస్

డెన్నీస్ జీవన్ దర్శకత్వంలో సందీప్ కిషన్ ,లావణ్య త్రిపాఠి జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ఏ వన్ ఎక్స్ ప్రెస్. ఈ సినిమాను అభిషేక అగర్వాల్, విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అయితే వసూళ్ళ పరంగా మాత్రం కాస్త వెనుకబడింది. విశేషమేంటంటే సందీప్ కిషన్ కొన్ని రోజుల పాటు ఈ సినిమా కోసం ఆటను ప్రాక్టీస్ చేశాడు.

అలాగే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కూడా హాకీ ప్లేయర్ గానే పాత్ర పోషించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అతి తక్కువ సమయంలోనే ఓటిటిలో రిలీజ్ కాబోతుంది. మే 1 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement