Tuesday, May 7, 2024

Rukmini: స‌ప్త సాగరాలు దాటి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రుక్మిణి

సినిమా ప్రపంచంలోకి కొత్త హీరోయిన్‌లు వస్తూనే ఉంటారు… భాష ఏదైనా కానివ్వండి తమ వద్ద టాలెంట్‌ ఉంటే చాలు ఒక్క సినిమాతోనే పాన్‌ ఇండియా రేంజ్‌ఉ చేరుకుంటారు. ఆపై ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతారు. అలాంటి స్టార్ల జాబితాలోకి తాజాగా ఓ కన్నడ ముద్దుగుమ్మ చేరింది. ఆమె పేరు రుక్మిణి వసంత్​.

రక్షిత్ శెట్టి నటించిన ‘సప్త సాగరాలు దాటి’ సినిమాలో నటించింది. ఆపై తెలుగు వారికి కూడా తెగ నచ్చేసింది ఈ బ్యూటీ. లండన్‌ వెళ్లి యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఇక్కడికి వచ్చింది.కన్నడ నుంచి రెండు సినిమాల్లో నటించినా ‘సప్త సాగరాలు దాటి’ చిత్రం ద్వారా పాపులర్‌ అయిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రిలీజ్‌ అయింది. ఈ చిత్రాల ద్వారా అందరినీ ఫిదా చేసింది. నటనతో పాటు తన అందంతోనూ ఈ అమ్మడు అందరినీ కట్టిపడేస్తుంది చాలామంది ఆమెను ప్రశంసించడమే కాకుండా సాయి పల్లవితో పోల్చారు. తాజాగా రుక్మిణి వసంత్ తన మొదటి తెలుగు చిత్రానికి సంతకం చేసింది. మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రంలో ఈ బ్యూటీకి ఛాన్స్‌ దక‍్కింది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్ డైరెక్షన్‌లో రవితేజ ఒక సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి..అందులో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement