Sunday, April 28, 2024

NLG: విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

మ‌ద్దిరాల‌, జ‌న‌వ‌రి 21(ప్ర‌భ‌న్యూస్‌): విద్యుత్ షాక్‌తో యువ‌కుడు మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మోటార్ సైకిల్ మెకానిక్ వర్కర్ రవి జీవ‌నం సాగిస్తున్నాడు.

రోజు వారీ ప‌నినిమిత్తం వాట‌ర్ స‌ర్వీసింగ్ చేస్తుండ‌గా ఒక్క‌సారిగా విద్యుత్ షాక్ త‌గిలింది. విద్యుత్ అధికారులు ట్రాన్స్ ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా హై వోల్టేజ్ రావడంతో యువకుడు షాక్‌గురై అక్కడికక్కడే మృతి చెందిన‌ట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement