Sunday, April 28, 2024

శేఖ‌ర్ క‌మ్ముల కొత్త మూవీలో హీరోయిన్ గా ర‌ష్మిక‌…

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ నటి రష్మిక మందన్న జోరు నడుస్తోంది. వరుసగా భారీ సినిమాలతో ఆమె క్షణం తీరిక లేకుండా ఉంది. అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’, రణబీర్ కపూర్ తో బాలీవుడ్‌ లో ‘యానిమల్’ సినిమా చేస్తోంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో భారీ ఆఫర్ చేరింది. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, తమిళ స్టార్ ధనుష్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ధనుష్ కు ఇది 51వ సినిమా. ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్న ఎంపికైంది.

ఈ విషయాన్ని చిత్ర బృందం ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. రష్మికకు స్వాగతం చెబుతూ ఓ పోస్టర్‌‌ ను విడుదల చేసింది. ఈ క్రేజీ ఆఫర్‌‌ తో రష్మిక చాలా సంతోషంగా ఉంది. పోస్టర్‌‌ ను ఫ్రేమ్ చేయించి ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement