Wednesday, May 1, 2024

ఫోటో గ్యాలరీని ప్రారంభించిన డీఎస్ డీవో చంద్రకళ

నిజామాబాద్ సిటీ, ఆగస్టు (ప్రభ న్యూస్)14 : పార్టిషన్ హర్రర్ రిమెంబరెన్స్ డే పురస్కరించుకుని ఎస్ బిఐ నిజామాబాద్ మెయిన్ బ్రాంచ్ లో సోమవారం ఫోటో గ్యాలరీని ప్రదర్శించారు. ఈ గ్యాలరీని సోషల్ వెల్పేర్ డెవలప్ మెంట్ ఆఫీసర్ చంద్రకళ హాజరై ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం 52 ఫోటో ప్రేమ్ లతో కూడిన ఫోటో గ్యాలరీ ప్రజల సందర్శనార్ధం ఉంచారు..రెండు రోజుల పాటు ఉంటే ఈ ఫోటో గ్యాల‌రీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్ డీవో తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ బిఐ రీజినల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ బి. రవి, హెచ్ ఆర్ మేనేజర్ రాజన్న, ఎస్ బిఐ నిజామాబాద్ చీఫ్ మేనేజర్ నవీన్ దేశ్ పాండే, మేనేజర్ జి.శ్రీనివాస్, ఇతర సిబ్బంది, ఖాతారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement