Friday, April 26, 2024

నాటు నాటు ప్ర‌జ‌ల పాట‌.. రామ్ చ‌ర‌ణ్

దేశంలోని కోట్లాది మంది ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ‌కు ల‌భించినందుకు ఆనందంగా ఉంద‌న్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.అకాడమీ అవార్డ్స్ నాటు నాటు పాటను గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఈ జర్నీ ఎలా అనిపించిందన్న ప్రశ్నకు రామ్ చరణ్ బదులిస్తూ.. ఇది తమకు చాలా ప్రత్యేకమన్నాడు. షూటింగ్ సమయంలో తాము ఆస్కార్ గురించి ఆలోచించలేదన్నాడు. ఇది ఆర్ట్ ఫిల్మ్ కానీ, ఆర్ట్ సాంగ్ కానీ కాదన్నాడు. కానీ అది ప్రజల పాట అయిందన్నాడు. ఈ పాటను ప్రజలు తమ సొంతం చేసుకున్నారన్నాడు.ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా మెరిసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాట అవార్డు గెలుచుకుంది. సంగీత దర్శకుడు కీరణవాణి, పాటల రచయిత చంద్రబోస్ అవార్డు అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement