Thursday, May 16, 2024

కొండారెడ్డి బురుజు సాక్షిగా రామ్,ఆది వార్

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే విలన్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నారు. అయితే తాజా అప్డేట్ అంటే… కొండారెడ్డి బురుజు సాక్షిగా రామ్ పోతినేని ఆది పినిశెట్టి లు తలపడనున్నారట. ఈ షూటింగుకు సంబంధించి రామోజీ ఫిలిం సిటీ లో కొండారెడ్డి బురుజు సెంటర్ ను సెట్ వేశారట.

గతంలో మహేష్ కు ఒక్కడు, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలలో కొండారెడ్డి బురుజు ను హైలెట్ చేసి చూపించారు. అంతేకాకుండా మహేష్ కూడా ఎంతగానో అది కలిసి వచ్చింది. మరి రామ్ కు ఏమేర ఇది కలిసొస్తుందో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు 2.75 కోట్ల రూపాయలకు హక్కులను సొంతం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement