Wednesday, May 8, 2024

‘రాధే శ్యామ్’ డిజిటల్ డీల్స్ ఇంకా నడుస్తున్నాయట !!

బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో పది రోజుల రీషూట్ కు సిద్ధమైంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ విషయంలో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్ కు సంబంధించి బిజినెస్ జరిగిందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ దీని డిజిటల్ రైట్స్ పై ఇంకా చర్చలు జరుగుతున్నాయట. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్రం తాలూకు హక్కులను సొంతం చేసుకోవాలని ట్రై చేస్తున్నారట. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement