Sunday, April 28, 2024

డింపుల్ పై పోలీస్ కేసు.. అధికారంతో త‌ప్పుని ఆప‌లేర‌న్న న‌టి

దురుసుగా ప్ర‌వ‌ర్తించింద‌నే ఆరోప‌ణ‌ల‌తో న‌టి డింపుల్ హ‌య‌తిపై జూబ్లీహిల్స్ లో కేసు న‌మోద‌యింది. ఓ ఐపీఎస్ కారును ఢీకొట్టడంతో పాటు దుర్భాషలాడినందుకు డింపుల్ పై పోలీస్ కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును డింపుల్ తన కారుతో ఢీకొట్టింది. ఆ తర్వాత రచ్చ చేస్తూ ఐపీఎస్ అధికారి ప్రభుత్వ వాహనాన్ని కాలుతో తన్నిందని తెలుస్తోంది. దాంతో రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై పోలీసులు సెక్షన్ 341, 279, 353 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. డింపుల్ హయతితో పాటు ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కూడా అదే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు.

ఐపీఎస్ కారును ఢీకొట్టడంతో పాటు దుర్భాషలాడినందుకు ఆమె పై కేసు నమోదు చేయడమే కాదు. విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాలంటూ పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. ఇక ఈ విషయం పై ఐపీఎస్ అధికారి రాహుల్ మాట్లాడుతూ.. ఈమె ప్రవర్తన మొదటి నుంచి ఇలానే ఉంటుంది. ఆమె చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. పలుమార్లు నచ్చచెప్పినా ఆమె పద్ధతి మార్చుకోలేదని అన్నారు రాహుల్ హెగ్డే. ఇదిలా ఉంటే ఈ విషయం పై డింపుల్ హయతి ట్విట్టర్ వేదికగా స్పందించింది. అధికారాన్ని ఉపయోగించి ఏ తప్పును ఆపలేరు అంటూ ట్వీట్ చేసింది . దాంతో పాటు ఓ స్మైలీ ఎమోజీని షేర్ చేసింది డింపుల్.ఇప్పుడీ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement