Tuesday, May 7, 2024

డేటింగ్ యాప్ లో ఫోటోలు…. పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి !!

సోషల్ మీడియా వాడకం ఇటీవల కాలం లో పెరిగింది. మంచికి ఎంతగా ఉపయోగిస్తున్నారో చెడుకి అదేవిధంగా ఉపయోగిస్తున్నారు. అందులో లో ముఖ్యంగా మహిళలను కించపరుస్తూ వేధిస్తూ పోస్టులు పెట్టడానికి ఈ సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు కొంతమంది ఆకతాయిలు. అలా మహిళలను వేధించే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది.

తాజాగా టాలీవుడ్ నటి గీతాంజలికి ఈ వేధింపులు తప్పలేదు. కొంత మంది ఆకతాయిలు తన ఫోటోలను మార్పింగ్ చేసి ఒక డేటింగ్ యాప్ లో పెట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటింగ్ యాప్ లో తన ఫోటోలు పెట్టడంతో మరికొంత మంది కాల్ చేసి తనను తీవ్రంగా వేధిస్తున్నారని… సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంక మొన్నటికి మొన్న సింగర్ మధుప్రియ కూడా తనను వేరువేరు ఫోన్ నెంబర్ లతో ఫోన్ చేసి కొంతమంది వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement