Friday, May 10, 2024

Om Bheem bush | సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఫిక్స్ !

యంగ్ హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ శ్రీ హర్ష కోనుగంటి తెర‌కెక్కిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘‘ఓం భీమ్ బుష్’’. ఈ సినిమా మార్చి 22న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకూ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌కి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలు ఉండగా.. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సన్నీ ఎంఆర్ సంగీతం అందించగా.. ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement