Sunday, April 28, 2024

‘రంగ్ దే’ జోరుకు బ్రేకులు

నితిన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ‘రంగ్ దే’ జోరు తగ్గింది. వీకెండ్ సందర్భంగా తొలి మూడు రోజుల్లో రూ.12 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ మూవీ.. నాలుగో రోజు హోలీ సెల‌వు రావడంతో కోటిన్నరకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే ఐదో రోజు మాత్రం ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. చాలా చోట్ల ‘రంగ్ దే’ వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. ఐదో రోజు కేవలం రూ.73 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.12.67 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్లకు చేరువలో షేర్ వసూలు చేసిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.9 కోట్లు వసూలు చేయాలి.

అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ వారం నాగార్జున వైల్డ్ డాగ్, కార్తీ సుల్తాన్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండింటిలో ఏ ఒక్క సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా నితిన్‌ సినిమాకు దెబ్బ పడటం ఖాయంగా కనపడుతోంది. ఏప్రిల్ 9న ‘వకీల్ సాబ్’ సినిమా నాటికి ‘రంగ్ దే’ థియేటర్ల నుంచి కనుమరుగు అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వచ్చే వారం ‘రంగ్ దే’కు చాలా కీలకమైన వారం. అదీ సంగతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement