Sunday, April 28, 2024

స్టార్స్ తో భోజ‌నం చేద్దామంటే.. కాల‌ర్ ప‌ట్టి లాగేశారు.. న‌వాజుద్దీన్ సిద్దీఖీ

వాయిస్ – హీరో వెంకటేష్ న‌టిస్తున్న సైంధవ్ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. తాజాగా నవాజ్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ సిద్దీఖీ తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు సంచలన నిజాలు వెల్లడించారు. కెరీర్ మొదట్లో, స్టార్ యాక్టర్ అవ్వకముందు సినీ పరిశ్రమలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అని అన్నారు. . సెట్ లో ఎవరూ పట్టించుకునేవారు కాదని చెప్పారు. అంతే కాదు కనీసం ప్రొడక్షన్ బాయ్ మంచినీళ్లు అడిగినా ఇచ్చేవాళ్లు కాదు.

సెట్స్ లో అందరూ కలిసి భోజనాలు చేయరు. స్టార్స్ కి ఒకచోట, జూనియర్ ఆర్టిస్టులకి ఒకచోట భోజనం పెట్టేవారు. ఓ సారి స్టార్స్ తో కలిసి భోజనం చేయాలనిపించింది. స్టార్స్ తినే దగ్గరకి వెళ్లి తినడానికి కూర్చున్నాను. భోజనం పెడతారు అనుకునే లోపే కొంతమంది సిబ్బంది వచ్చి నా కాలర్ పట్టుకొని బయటకు లాగేశారు. ఆ రోజు చాలా బాధపడ్డాను అని తెలిపారు. నవాజుద్డీన్ లా చాలా మంది స్టార్స్ ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసి.. స్టార్స్ గా మారినవాళ్లే. ఈక్రమంలో దీంతో బాలీవుడ్ లో నవాజుద్దీన్‌ సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement